Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ సూచన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కోవిడ్ ఒమిక్రాన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా కావాలని టీపీసీసీ ప్రొఫెసనల్ కాంగ్రెస్ సూచించింది. బుధవారం గాంధీభవన్లో పార్టీ నేతలు డాక్టర్ శ్రవణ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి విలేకర్లతో మాట్లాడారు. కరోనా కొత్త వైరస్ ప్రపంచ దేశాలను భయపెడుతున్నదని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారితోపాటు తీసుకోని వారిపై కూడా కరోనా ఒమిక్రాన్వైరస్ ప్రభావం చూపుతుందా? లేదో? అనేది ఎవరికీ తెలియదన్నారు. ఇప్పటికే కరోనాతో ఎంతో మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. .