Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతాంగ సమితి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయని తెలంగాణ రైతాంగ సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయన్న, జక్కుల వెంకటయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. తడిసిన ధాన్యంతో సహా మొత్తం ధాన్యాన్ని కొనాలని వారు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. డబ్ల్యూటీవో ఒప్పందంమేరకు ప్రజాపంపిణీ వ్యవస్థలను నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని తెలిపారు.