Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైకోర్టులో న్యాయవాదులుగా చేసే గట్టు వామనరావు, గట్టు నాగమణి దంపతుల దారుణ హత్య కేసు నిందితుడు వసంతరావుకు బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత బెయిల్ మంజూరు చేశారు. 'రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. రామగుండం జిల్లాలోకి నిందితుడు వెళ్లకూడదు. సాక్షులను ప్రభావితం చేయకూడదు. కేసు దర్యాప్తునకు సహకరించాలి. బెయిల్ నిబంధనలు ఉల్లఘించరాదు' అని న్యాయమూర్తి షరతులు పెట్టారు.