Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమోదం తర్వాతే కొత్త మాడ్యూల్స్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్లో తలెత్తున్న సమస్యలపై అధ్యయనం కోసం వేసిన క్యాబినెట్ సబ్కమిటీ రిపోర్టును తయారు చేసి సీఎం కేసీఆర్కు సమర్పించింది. సబ్కమిటీ గురువారం సమావేశమైంది. ధరణి పోర్టల్లో కొత్తగా చేర్చాల్సిన మాడ్యుల్స్పై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. నవంబర్ 12న మొదటిసారి సమావేశమైనప్పుడే సుమారు 20 రకాల సమస్యలపై సబ్కమిటీకి పలువురు విన్నవించారు. రెండో సమావేశంలో మరికొన్ని కొత్త సమస్యలు కమిటీ దృష్టికి వచ్చాయి. అందులో పలు సమస్యల పరిష్కారానికి మాడ్యుల్స్ను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేసింది.