Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రకటించారు. రాష్ట్రంలో అంగన్వాడీ విద్యను పటిష్టం చేయడం ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేసే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుననట్టు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంయుక్త నిర్వహణపై సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్లో ఆయా శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ విద్య లేని లోటును గమనించిన రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల నుంచి ఆరేండ్లలోపు విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు నర్సరీ విద్యనూ తఅందించాలనే ఉద్దేశ్యంతో అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించడం వల్ల నర్సరీ నుంచి నేరుగా ప్రాథమిక విద్యకు విద్యార్థులను సంసిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రాలంటే కేవలం పౌష్టికాహారం అందించడానికే పరిమితం కాదనీ, అక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్య అందించడంతోపాటు పిల్లలను ప్రాథమిక విద్య కొనసాగించడానికి ముందునుంచే పాఠశాలలకు పరిచయం చేయాలని అన్నారు. తద్వారా మధ్యలో బడి మానేయడాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే 15,167 అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్నాయని చెప్పారు. 11,185 అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు ఉన్నాయనీ, 12,174 కేంద్రాలు కిరాయి లేకుండా ఇతర భవనాల్లో నడుస్తున్నాయని అన్నారు. మరో 12,219 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్టు వివరించారు. తొలుత అద్దె భవనాల్లో నడుస్తున్న ఈ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపడుతామని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారులు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తామన్నారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్టేట్ హోంలోని పిల్లలకు మంత్రులు స్టేషనరీ వస్తువులు కలిగిన బ్యాగులు అందించారు. విద్యార్థులకు చేయుత అందించేందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ నిర్వహకు లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య దేవరాజన్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ శ్రీదేవసేన ఇతర అధికారులు పాల్గొన్నారు.