Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిస్కాంలకు ఈఆర్సీ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యుత్ ఛార్జీల టారిఫ్ సవరణ ప్రతిపాదనలను వారం రోజుల్లోపు సమర్పించాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)... డిస్కాంలను కోరింది. ఈ మేరకు గురువారం ఆయా సంస్థలకు లేఖ రాసింది. ఛార్జీల సవరణకు సంబంధించి నవంబరు 30న డిస్కాంలు ఏఆర్ఆర్లను సమర్పించిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించిన ఈఆర్సీ... బహిరంగ విచారణ, అభ్యంతరాల స్వీకరణ తదితరాంశాలకు సంబంధించి 2003 విద్యుత్ చట్టం ప్రకారం 120 రోజుల ముందు ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉందనీ ఈ సందర్భంగా డిస్కాంలకు గుర్తు చేసింది.