Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి చీఫ్ గార్డెనర్ వై సత్యనారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల జీవితాలు ఎంతో ఆదర్శమని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి చీఫ్ గార్డెనర్, మాజీ ఐవోఎఫ్ఎస్, వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ వై సత్యనారాయణ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని అకాడమిలో ఫూలే, అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.ఆ మహనీయుల జీవితాలు ఆచరణప్రా యమని అన్నారు.వారి జీవితాల నుంచి విద్యార్థులు ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని సూచించారు. ఫూలే 161ఏండ్ల క్రితం, అంబేద్కర్ 65 ఏండ్ల క్రితం మరణించినా గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించారని వివరించారు. అకాడమి ప్రిన్సిపాల్ సురేందర్రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె సతీష్కుమార్ మాట్లాడుతూ వారి స్ఫూర్తి, వ్యక్తిత్వం నేటితరానికి ఎంతో ఆదర్శమని అన్నారు. ప్రతిఒక్కరూ వారిలాగే తాత్విక ఆలోచన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు వి స్నేహ, పి స్రవంతి, కీర్తన, శ్రీకాంత్, అల్తాఫ్ హుస్సేన్, అమీర్భాష, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.