Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీటింగ్ లకు, ట్రైనింగ్ బహిష్కరణ: సాక్స్ ఉద్యోగుల సహాయ నిరాకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేయాలని అఖిల భారత ఎయిడ్స్ నియంత్రణ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆర్.సుజిత్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీస్ వెల్పేర్ అసోసియేషన్ అన్ని రాష్ట్రాల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. పీఆర్సీ అమలయ్యేంత వరకూ రిపోర్టులు గానీ, ఎటువంటి డాటా ఇవ్వకూడదని నిర్ణయించామని తెలిపారు. అదే సమయంలో నిర్వహించే సమావేశాలకు, శిక్షణకు వెళ్లబోమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే జనవరి ఒకటి నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.