Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామారెడ్డి అటవీశాఖ కార్యాలయంలో ఘటన
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
తనకు జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారన్న మనస్తాపంతో అటవీశాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా అటవీశాఖ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధితుడు రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2020 డిసెంబర్ నుంచి ఎల్లారెడ్డి అటవీశాఖ బేస్ క్యాంపులో రవీందర్ వాచర్గా పని చేస్తున్నాడు. గత మార్చి 10వ తేదీన అతని చెల్లెలి పెండ్లి ఉండటంతో పది రోజులు సెలవు తీసుకున్నాడు. మార్చి 12 నుంచి విధులకు హాజరయ్యారు. అప్పటి నుంచి ఎఫ్డివో శ్రీనివాస్ అతన్ని సొంత పనులకు వాడుకున్నారు. ఆ తర్వాత రవీందర్పై వేధింపులకు పాల్పడుతున్నారు. అటవీ శాఖకు సంబంధించిన రూ.1.20 లక్షలు సొంత పనులకు వాడుకున్నారు.