Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ వర్ధంతిసభలో జి రాములు, ప్రొఫెసర్ అన్సారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత ప్రమేయం లేని భారత లౌకిక దేశాన్ని, బీజేపీ మతరాజ్యంగా మారుస్తున్నదని తెలంగాణ ప్రజాసంస్కతిక కేంద్రం రాష్ట్ర కన్వీనర్ జి రాములు,ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.డీ.అన్సారీ విమర్శించా రు.సోమవారం హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో డా బి ఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సభను నిర్వహించా రు.తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అనేక అవమానాలు వివక్షత అనుభవించారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం తర్వాత దిశానిర్ధేశం చేశారని వివరించారు. బీజేపీ అధికారం చేపట్టిన్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని చెప్పారు. చరిత్రను వక్రీకరిస్తున్న దుర్మార్గపు పోకడలు దేశానికి మరింత నష్టం చేస్తాయని చెప్పారు. సభకు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు అధ్యక్షత వహించగా ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.డీ అబ్బాస్, డీ వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మూడ్ శోభన్, కేవీపీఎస్ నాయకులు కొమ్ము విజరు కుమార్, జి రాములు, జి కృష్ణ పాల్గొన్నారు.