Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రెండు వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సోమవా రం హైదరాబాద్లో నిర్వహించిన జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడా రు.పరిశ్రమల ఏర్పాటుకు జర్మనీ రూపొందించిన విధివిధానాలు బాగున్నాయని ప్రశంసించారు.అక్కడి ప్రభుత్వంతో,పారిశ్రామికవేత్తలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా జర్మనీకి చందిన లైట్ఆటో జీఎంబీహెచ్ కంపెనీ రాష్ట్రంలో రూ.1,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.