Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెర్ప్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఆ సంస్థ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కుంట గంగాధర్రెడ్డి, ఏపూరి నర్సయ్య, మహేందర్రెడ్డి, సుభాష్గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై సోమవారం సెర్ప్ ప్రధాన కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు.సెర్ప్లో ఆరేండ్లు బదిలీలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం కౌన్సిలింగ్ నిర్వహించి సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్త జిల్లాల్లో స్థానికత ఆధారంగా పోస్టులను విభజించాలనీ, ఆ జిల్లాలో జన్మించిన ఉద్యోగుల లెక్క ప్రకారం పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి చేసి సొంత జిల్లాలకు పంపాలని కోరారు. అలాగైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందనీ, మానవతా దృక్పథంతో చర్యలు తీసుకోవా లని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే క్యాడర్లో ఆరేండ్లకు మించి ఉన్నవారికి ప్రత్యేకంగా ఆరు శాతం పదోన్నతి ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు.కారుణ్యనియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పలు కారణా లతో సస్పెన్షన్కు గురై నెలల తరబడి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు.ఉద్యోగ సంఘాలతో సెర్ప్ ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సిబ్బంది వినతులను స్వీకరించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు.