Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో సీఎంను కలుస్తాం : టీఎన్జీవో అధ్యక్షుడు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంగళవారం నుంచి ఈనెలాఖరు వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కోరారు. ఈ మేరకు ఉద్యోగుల విభజన రాష్ట్రస్థాయి కమిటీ చైర్మెన్ వికాస్రాజ్ను సోమవారం ఆయన కలిసి ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా స్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభమయ్యాక జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విధివిధానాలు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ను కలిసి ఉద్యోగుల సమస్యలన్నీ వివరిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని కోరతామన్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ తర్వాత ఖాళీల భర్తీ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 70 వేల వరకు ఖాళీలున్నట్టు ప్రభుత్వం గుర్తించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవో కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం టీఎన్జీవో కేంద్రసంఘం కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఆ సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, నాయకులు జగదీష్, కిషన్, శ్రావణ్, శ్రీరామ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.