Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పీఅర్సీ ని వర్తింప చేస్తూ ప్రభుత్వం జీవో నెం 114 విడుదల చేసింది. ఇందుకోసం కృషి చేసిన పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు , దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడికి అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఅర్.శర్మ సోమవారం కతజ్ఞతలు తెలియజేశారు. దేవాదాయశాఖలో కటాఆఫ్ తేదీని తొలగించి మిగిలిన 1,252 తాత్కాలిక అర్చక ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలనీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని తెలిపారు.