Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శిగా వై.యాకయ్య
నవతెలంగాణ - గోదావరిఖని
సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా నూతన కమిటీ ఎన్నికయింది. పార్టీ జిల్లా 2వ మహాసభ సిరి ఫంక్షన్ హాల్లో గోదావరిఖని ఈస్ట్ ఏరియా కమిటీ నిర్వహణలో రెండ్రోజుల పాటు జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా రెండోసారి వై.యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎరవెల్లి ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎం.రామాచారి, ఎ.మహేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులుగా జి.జ్యోతి, బి.గణేష్, బి.సంతోష్, డి.కొమురయ్య, ఎం.శ్రీనివాస్, నాంసాని శంకర్, ఎం.సారయ్య, సీపెల్లి రవీందర్, ఏల్పుల లావణ్య, కె.అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.