Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసిఫాబాద్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
- కార్యదర్శిగా కూశన రాజన్న
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా మహాసభలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. జిల్లా అభివృద్ధికి పార్టీ చేపట్టాల్సిన అంశాలను రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులకు కార్యకర్తలకు వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. దీనిలో భాగంగా పలు తీర్మానాలు చేశారు. ఆదివారం మహాసభల రెండో రోజు 14మంది సభ్యులతో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మహాసభల రెండో రోజు 14 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా కూశన రాజన్న తిరిగి రెండోసారి ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యులుగా అల్లూరి లోకేష్, ముంజం శ్రీనివాస్, ముంజం ఆనంద్ కుమార్, గొడిసెల కార్తిక్, చాపిలే సాయికృష్ణ, ఉమ, దుర్గం అనిత, జె.రాజేందర్, దిగిడే బక్కన్న, నెర్పల్లి అశోక్, దుర్గం రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ మహాసభకు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మీడియం బాపురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య, బండారు రవికుమార్ పర్యవేక్షించారు.