Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిటీబ్యూరో
సీపీఐ(ఎం) మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కార్యదర్శిగా పి. సత్యం ఎన్నికయ్యారు. రెండు రోజులుగా జరుగుతున్న మేడ్చల్- మల్కాజిగిరి మహాసభల్లో భాగంగా ఆదివారం 20మందితో జిల్లా నూతన కమిటీని ఎనుకున్నారు. కార్యదర్శివర్గ సభ్యులుగా సీహెచ్ కృష్ణారావు, కె.రవి, ఎ.అశోక్, సీహెచ్ యాదయ్య, వినోద, జె.చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులుగా ఎంపీ నరేష్, ఎన్.శ్రీనివాస్, ఐ.రాజశేఖర్, కె.లక్ష్మణ్, ఏ.శ్రీనివాస్, ఆర్.సంతోష్, సృజన, సబితా, పి.వెంకట్, జి.శ్రీనివాస్, వెంకట్రామయ్య, ఆర్.వరప్రసాద్, ఎం.శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మహాసభల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, జి. రాములు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. సుధా భాస్కర్, ప్రతినిధులు పాల్గొన్నారు.