Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల పాదాలకు గాయాలు
- షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
గురుకుల పాఠశాలలో ఎలుకలు విద్యార్థులను కరిచాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పరిధిలోని చటాన్పల్లిలో ఉన్న గురుకుల పాఠశాలలో 800 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకులలో కేశంపేట్, దౌల్తాబాద్కు చెందిన రెండు బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. అయితే ,ఆదివారం రాత్రి విద్యార్థులు భోజనం చేసి నిద్రపోయారు. ఒకే రూమ్లో 40 మంది నిద్రపోయారు. ఎలుక 9 మంది విద్యార్థుల పాదాలపై దాడి చేసింది. దీంతో విద్యార్థులకు గాయాల్యయాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుచుప్పుడు కాకుండా గురుకుల సిబ్బంది విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే వసతి గృహానికి చేరుకుని విద్యార్థుల క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి అపాయం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తిరిగి వెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని ప్రిన్సిపాల్ సుభాన్ఖాన్ తెలిపారు.