Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు ఎంప్లాయీస్ యూనియన్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు లేఖ రాసింది. 2019 డిసెంబర్లో రెండేండ్లు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉండవనీ, ఆ స్థానంలో వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారని యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, కే రాజిరెడ్డి తెలిపారు. తక్షణం వెల్ఫేర్ బోర్డులను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వేతన సవరణ, డీఏ బకాయిలు సహా అనేక పరిష్కారం కావల్సిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.