Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రికి తరలింపు
నవ తెలంగాణ-నర్సాపూర్
కల్తీ కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురైన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని గూడెంగడ్డ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నర్సింలు, శ్రీనివాస్, చంద్రయ్య, అంజయ్య, శ్రవణ్, రమేష్, పోచయ్య, బొడ్డ రాజు, రాజుతో పాటు మరికొంతమంది బుధవారం రాత్రి కల్లు దుకాణంలో కల్లు సేవించారు. అనంతరం వారికి కండ్లు తిరగడం, మెడలు వంకర పోయి పడిపోవడంతో పాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానికులు నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు.