Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊపిరాడక రైతు మృతి
నవతెలంగాణ-జగిత్యాల
పొలంలో వ్యర్థాలు కాలుస్తుండగా ఊపిరాడక రైతు మృతి చెందిన ఘటన జగిత్యాల రూరల్ మండలం వెల్దూర్తిలో బుధవారం జరిగింది. జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి గ్రామానికి చెందిన పోతుగంట లక్ష్మణ్(65) తన వ్యవసాయ పాలంలో వరి కొయ్యలను తగుల బెడుతుండగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఊపిరాడక లకëణ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.