Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
ఉపాధి, ఉద్యోగం లేక మానసికంగా కృంగి యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుం ది. స్థానికులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన నీలం ప్రణరు(24) మాతృమూర్తి, తండ్రి యాదగిరి(వీఆర్ఏ) ఏడేండ్ల కిందట మృతిచెందాడు. యాదగిరి వీఆర్ఏ పోస్టు ప్రణరు అన్న ప్రశాంత్కు ఇచ్చారు. 2019లో డిగ్రీ పూర్తి చేసుకు న్న ప్రణరు అదే ఏడాది హైదరాబాద్కు వెళ్లాడు. పని చేసుకుంటూ చదువుకుందామని భావించాడు. కానీ, ఎలాంటి ఉపాధి దొరకలేదు. లాక్డౌన్ సమయంలో తరచూ ఇంటికొస్తూ హైదరాబాద్కు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆయన మానసిక పరిస్థితి విషమించింది. లాక్డౌన్ అనంతరం స్వగ్రామానికి వచ్చాడు. పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసుకోడానికి యత్నించాడు. ఇదే క్రమంలో ఇంట్లో రాత్రి అందరూ నిద్ర పోగానే ఇంటి పైకి వెళ్లి పిల్లర్కు తాడుతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఎస్సై రఘుపతి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.