Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విలేకరులు
పే స్కేల్ అమలు చేసి కనీస వేతనం పెంచి, పనిఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేపట్టిన నిరసనలు రోజురోజుకూ ఉధృతమవు తున్నాయి. వీరి ఆందోళనలకు రాజకీయ పక్షాలు మద్ధతు ప్రకటిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గురువారం నిరసనలు కొనసాగాయి. వీఆర్ఏలు వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒంటికాలిపై నిలబడి, వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు కారుణ్య నియామకాలు అమలు చేయాలనీ, పనిఒత్తిడి తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించాలనీ, మృతిచెందిన వీఆర్ఏల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.