Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా గొల్లపల్లి జయరాజు ఎన్నికయ్యారు. ఈ నెల 10,11 తేదీల్లో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన సీపీఐ(ఎం) జిల్లా మహాసభల్లో గత కార్యక్రమాలపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా 19 మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నట్టు జిల్లా నూతన కార్యదర్శి గొల్లపల్లి జయరాజు తెలిపారు. ఆదివారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభల జయప్రదానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పోరాటాల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయనీ, అన్ని వర్గాల ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. మహాసభల్లో జిల్లా సమస్యలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి, పోరాటాలపై చర్చించామన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా.. గొల్లపల్లి జయరాజు, బి. మల్లేశం, రాజయ్య, మాణిక్యం, రామచందర్, సాయిలు, నర్సింహారెడ్డి ఎన్నికయ్యారు.