Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 210 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 40,997 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 5,700 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,833 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 87 మందికి కరోనా సోకింది.
15 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం జీహెచ్ఎంసీతో సహా 15 జిల్లాల్లో కేసులు పెరిగాయి. జోగులాంబ గద్వాల, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, నల్లగొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ రూరల్, హనుమకొండ, జిల్లాల్లో కేసులు పెరిగాయి.
11 జిల్లాల్లో తగ్గిన కేసులు
భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, సిద్ధిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తగ్గాయి. ఆదిలాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నారాయణపేట, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఎలాంటి మార్పు లేదు.