Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బ్యాగరి వృత్తి విధ్వంసానికి కుట్ర జరుగుతున్నదని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట నల్లవాగు స్మశాన వాటికలో పూర్వం నుంచి వృత్తి నిర్వహిస్తుండగా స్థానిక భూ ఆక్రమణ దారులు చెరువును కబ్జా చేయటం కోసం బ్యాగర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం చేపడతామని మాలమహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, ఉపాధ్యక్షులు దార సత్యం, రాష్ట్ర కార్యదర్శి నాయకోటి రవికాంత్, శ్రావణ్ హెచ్చరించారు.