Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీని డెహ్రాడూన్కు చెందిన ఇందిరాగాంధీ జాతీయ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ భరత్ జ్యోతి శుక్రవారం సందర్శించారు. శిక్షణలో ఉన్న అటవీ అందుతున్న విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. అకాడమీలోని సౌకర్యాలు, క్షేత్రస్థాయి శిక్షణ, తదితర అంశాలను పరిశీలించారు. అడవులు, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్ను నెలకొల్పడంలో సీఎం కేసీఆర్ చొరవను అభినందించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అకాడమీ ఆవరణలో మొక్కను భరత్జ్యోతి నాటారు.