Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు, బాగా రాయని వారు వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే పరీక్షలు మళ్లీ రాయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సూచించారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించామనీ, ఫలితాలను పకడ్బందీగా విడుదల చేశామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలపై విద్యార్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు. విద్యార్థులు ఒకటి లేదా అన్ని సబ్జెక్టుల సామర్థ్యం తెలుసుకోవాలనుకుంటే ఫీజు చెల్లించి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జవాబు పత్రం నకలును అందజేస్తామని తెలిపారు.