Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా మల్లేషం
నవతెలంగాణ-నర్సాపూర్
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని షాదీఖానాలో రెండ్రోజులుగా జరుగుతున్న సీపీఐ(ఎం) మెదక్ జిల్లా 14వ మహాసభ ఆదివారం ముగిసింది. కాగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జయలక్ష్మి సమక్షంలో మెదక్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శిగా ఎ.మల్లేషం రెండోసారి ఎన్నికయ్యారు. కార్యదర్శివర్గ సభ్యులుగా కె.నర్సమ్మ, మహేందర్ రెడ్డి, బస్వరాజ్, మల్లేశం ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కడారి నాగ రాజు, సంతోష్, సత్యం, వాసు, మల్లేశం, గీత, బాలయ్యలను ఎన్నుకున్నారు.