Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధరూర్
సీపీఐ(ఎం) గద్వాల జిల్లా కార్యదర్శిగా ఎ.వెంకటస్వామి రెండోసారి ఎన్నికయ్యారు. గద్వాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన జిల్లా రెండో మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెంకట స్వామి వివరాలు వెల్లడించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, జాన్వెస్లీ, రాష్ట్ర నాయకులు కిల్లేగోపాల్ సమక్షంలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. జిల్లా కార్యదర్శిగా ఎ.వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులుగా రేపల్లే దేవదాసు, వీవీ నర్సింహ, జి.రాజు, మద్దిలేటి, నర్మద, ఉప్పేరు నర్సింహ, పరంజ్యోతి, తిప్పన్న, రాములు, ఈదన్న ఎన్నుకున్నారు.