Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్రంలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎడ్సెట్ కన్వీనర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఆచార్య రామరాజు వెంకటేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా మరణించారు. నీళ్లు, నిజాలను తెరమీదకు తెచ్చి తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన కేంద్ర జలవనరుల సంఘం మాజీ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు ఆర్ విద్యాసాగర్రావుకు ఆయన స్వయానా సోదరుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్కృత పాఠశాల అభివృద్ధిలోనూ రామరాజు వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారు.