Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునేవారి ఆదాయ పరిమితి ఇప్పటి వరకు రూ.1.50 లక్షలు, ఈబీసీల వార్షికాదాయం లక్షా రూపాయలు, డీఎన్ టీ విద్యార్థుల ఆదాయం రూ. 1.50 ఉండేది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వరసగా రూ.2.50 లక్షలకు పెంచటంతో పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. విద్యార్థుల వార్షికాదాయాన్ని పెంచుతూ జీఓ జారీ చేయడం వల్ల లక్షలాదిమంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్గౌడ్ తెలిపారు.సీఎం కేసీఆర్కీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.