Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టసవరణ చేయాలి : ఎం పద్మనాభరెడ్డి
నవతెంలగాణబ్యూరో-హైదరాబాద్
న్యాయస్థానం నిర్థారించిన నేరస్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంచేలా ఎన్నికల చట్టానికి సవరణ చేయాలని ఫోరం ఫర్గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి కోరారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల చట్ట సవరణ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఎన్నికల్లో డబ్బు పాత్ర, నేరచరిత్ర ఉన్న వారిని ఎన్నికలకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లు ఎన్నికల చట్టంలో గల లోపాలను ఏ మాత్రం అరికట్టలేదని పేర్కొన్నారు. కేంద్రం ఎన్నికల్లో డబ్బు పాత్ర తగ్గించాలని సూచించారు. చట్టాలను అతిక్రమించిన నేరస్థులు చట్టసభల్లో అడుగుపెట్టి చట్టలను రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.