Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామన్ అకడమిక్ క్యాలెండర్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లోని విద్యార్థులకు ఈనెల 27 నుంచి మొదటి, మూడో సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కామన్ పీజీ అకడమిక్ క్యాలెండర్ను మంగళవారం విడుదల చేసింది. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఎస్డబ్ల్యూ, ఎంసీజే, బీఎల్ఐఎస్సీ, ఎంపీఈడీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 27వ తేదీ వరకే అవకాశముందని తెలిపింది. వచ్చేనెల 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని పేర్కొంది. అదేనెల 17 నుంచి తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వివరించింది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్నల్ అసెస్మెంట్-1, ఏప్రిల్ 22,23 తేదీల్లో ఇంటర్నల్ అసెస్మెంట్-2 నిర్వహిస్తామని ప్రకటించింది. మే 10 నుంచి థియరీ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అదేనెల 26 నుంచి రెండు, నాలుగో సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది.