Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో ఐఏఎస్ అధికారి రిట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సీబీఐ ప్రాసిక్యూషన్కు రాష్ట్ర సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదనీ, అయినా విచారణ చేయడం చట్ట వ్యతిరేకమని ఏపీ ఐఏఎస్ అధికారి డి.మురళీధర్రెడ్డి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూముల కేటాయింపుల వ్యవహారంపై సీబీఐ ప్రాసిక్యూషన్కు రాష్ట్రం అనుమతి పొందాలని సీఆర్పీసీలోని 197వ సెక్షన్ చెబుతోందని ఆయన లాయర్ వాదించారు. సీబీఐ వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ప్రకటించారు. ఆ ప్రాజెక్టు వల్ల పిటిషనర్కు వ్యక్తిగతంగా ఏమీ ప్రయోజనాలు చేకూరలేదనీ, ఉన్నతాధికారులు చెప్పినట్టుగానే చేశారనీ, ఈవిషయాన్ని సీబీఐ చార్జిషీటులో కూడా చెప్పిందని పిటిషనర్ వాదన.