Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దళిత బంధు పథకం అమలు కోసం నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. వాటిని ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి రూ. 50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని చారగొండ మండలానికి రూ. 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలానికి రూ. 50 కోట్లను విడుదల చేసింది.