Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 54వ సీనియర్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజిపురం విద్యార్థిని ఎంపికైంది. జెడ్పీ హెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న ముద్రబోయిన అర్చన జ్యోతి మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైందని జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజనేయులు తెలిపారు. మంగళవారం జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో విద్యార్థిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎదునురి ప్రేమలత మల్లేశం, ఎంపీటీసీ గునుగుంట్ల కల్పన శ్రీనివాస్గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీళ్ల దశరథరెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయుడు నాతి కృష్ణమూర్తి పాల్గొన్నారు.