Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 39 మందితో జిల్లా కమిటీ ఎన్నిక
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా మల్లు నాగార్జున్రెడ్డి రెండో సారి ఎన్నికయ్యారు. ఆయనతో పాటు 39 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్వహించిన పార్టీ జిల్లా రెండో మహాసభలు ముగిశాయి. ఈ సభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పోరాటాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.