Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త పోస్టింగులో చేరిన తర్వాతే అప్పీళ్లకు అవకాశం : ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా స్పౌస్ కేసులను ప్రభుత్వం పరిశీలించనుంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేసే కేటాయింపుల్లో భాగంగా కొత్త పోస్టింగుల్లో చేరిన తర్వాతే స్పౌస్ కేసుల కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీళ్లు సహా స్పౌస్ కేసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేసే కేటాయింపులపై అభ్యంతరాలుంటే ఉద్యోగులు అప్పీల్ చేసుకునే అవకాశముంటుందని తెలిపారు. అయితే ముందు కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీల్కు అవకాశం ఉంటుందని వివరించారు. జిల్లా క్యాడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి, జోనల్, మల్టీజోనల్ క్యాడర్ ఉద్యోగులు వారి శాఖాధిపతులకు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చిన అప్పీళ్లన్నింటినీ సంబంధిత శాఖ కార్యదర్శికి శాఖాధిపతులు నివేదించాల్సి ఉంటుందని వివరించారు. పూర్తి విచారణ తర్వాత త్వరితగతిన అప్పీళ్లను పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులనూ ఆయన ఆదేశించారు.