Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రెస్అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన లబ్దిదారులు తమ తమ జిల్లాకు సంబంధించిన పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు, డీపీఆర్వోల ద్వారా లైఫ్ సర్టిఫికెట్లను ధృవీకరించి మీడియా అకాడమీ కార్యాలయానికి వచ్చే ఫిబ్రవరి 15వ తేదీలోపు పంపాలని సూచించారు. వాటిని కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి.నె.10-2-1, సమాచార్ భవన్, 2వ అంతస్థు, ఎ.సి. గార్డ్స్, మాసాబ్ట్యాంక్, తెలుగు చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్కు అన్న చిరునామాకు పంపాలని కోరారు. సమయానుకూలంగా సర్టిఫికెట్లను సమర్పించకపోతే వచ్చే ఏడాది మార్చి నుంచి పెన్షన్ నిలిపేస్తామని పేర్కొన్నారు.