Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇటీవల ఒమిక్రాన్ కేసు నమోదైన వ్యక్తి భార్య, తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధార ణయింది. దుబాయ నుంచి స్వగ్రామానికి వచ్చిన వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలినట్టు నిర్ధారణ కావడంతో వైద్యులు అతన్ని హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన వైద్య అధికారుల బృందం బాధిత కుటుంబ సభ్యు లకు టెస్టులు చేసింది. అతని భార్య, తల్లికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి గ్రామంలో పదిరోజుల పాటు లాక్డౌన్కు తీర్మానించింది. హోటళ్లు, కిరాణా షాప్లు మూసేయాలని పంచాయతీ పాలకవర్గం తెలిపింది.