Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబ కలహాలే కారణం
నవతెలంగాణ-దామరచర్ల
కుటుంబ కలహాల కారణ ంగా ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నునావత్తండాలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నునావత్తండాకు చెందిన కిషన్నాయక్, భూలకిëకి పదేండ్ల కింద వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు సంతానం. కిషన్నాయక్ తన ఏకరన్నర పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. దాంతోపాటు ఆటో కూడా నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పలుమార్లు పెద్దమనుషులను ఆశ్రయించారు. వారిద్దరికి పెద్దమనుషులు నచ్చజెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కిషన్నాయక్ ఇద్దరు కుమారులైన హర్షవర్ధన్(8), అఖిల్(6)ను తీసుకుని తండా శివారుకు వెళ్లాడు. వారికి జ్యూస్లో పురుగుల మందు కలిపి తాగించాడు. అనంతరం అతను చెట్టుకు ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు గమనించి కుటుంబీకులకు చెప్పారు. విషయం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.