Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన... శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఒంట్లో నలతగా ఉండటంతో శనివారం సాయంత్రం కోవిడ్ యాంటిజెన్ రాపిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే మంత్రి ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. గత మూడు నాలుగు రోజులుగా తనను కలిసిన వారందరూ వెంటనే కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.