Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పుట్టి పెరిగిన జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణించాలనీ, బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి స్థానిక జిల్లాలలకు అవకాశం కల్పించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్రి వేదమహిపాల్ రెడ్డి, అరికల వెంకటేశం ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్ళిన ఉపాధ్యాయులకు మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలనీ, భార్య భర్తలు ఒకే జిల్లాలో పని చేసేవిధంగా, ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.