Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 182 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 37,839 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 3,635 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,417 యాక్టివ్ కేసులున్నాయి.
18 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో ఆదివారంతో పోలిస్తే సోమవారం జీహెచ్ఎంసీతో సహా 18 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పెరిగాయి. జనగామ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, హన్మకొండ జిల్లాల్లో కేసులు తగ్గాయి.
12 మందికి ఒమిక్రాన్
రాష్ట్రంలో సోమవారం మరో 12 మందికి ఒమిక్రాన్ సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది.. దీంతో ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 55కు చేరింది.