Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రచయిత గౌరీశంకర్కు అభినందన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ రచించిన 'పచ్చాపచ్చని పల్లె' పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)సోమేశ్కుమార్ ఆవిష్కరి ంచారు.అకాడమి అధ్యక్షులుగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన సోమవారం సోమేశ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ దేశంలోనే పల్లెప్రగతి పథకం అద్భుత ఆవిష్కరణ అని అన్నారు.స్వరాజ్యానికి ఇది ప్రాణం పోసిం దనీ చెప్పారు.పల్లె ప్రగతితో వాటి ముఖచిత్రం మారిపోయిం దన్నారు.పల్లెల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని స్వచ్ఛ భారత్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని చెప్పారు. ప్రతి పల్లె సర్వ స్వతంత్ర కేంద్రంగా నిలవడానికి సీఎం కేసీఆర్ దార్శనికత ఆలోచనా విధానం ఎంతో దోహదం చేసిందన్నారు. ఈ క్రమంలో స్ఫూర్తిదాయక పుస్తకాన్ని రచించిన గౌరీశంకర్ను ఆయన అభినందించారు.