Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 228 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 41,678 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 4,828 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,459 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 110 మందికి కరోనా సోకింది.
14 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం జీహెచ్ఎంసీతో సహా 14 జిల్లాల్లో కేసులు పెరిగాయి. జగిత్యాల, జనగామ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పెరిగాయి.
ఎనిమిది జిల్లాల్లో తగ్గిన కరోనా
ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, వనపర్తి, వరంగల్ రూరల్, హన్మకొండ జిల్లాల్లో కేసులు తగ్గాయి. మిగిలి జిల్లాల కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.