Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ నియోజకవర్గాలన్నింటిలోనూ గెలవాలి
- వర్క్ షాప్లో బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా 'మిషన్-19' లక్ష్యంతో ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే ఆ నియోజకవర్గాలే అత్యంత కీలకమని తెలిపారు. ఆ స్థానాల్లో బీజేపీ బలం పెరిగిందనీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి తీవ్రరూపం దాల్చిందని ఇటీవల నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ తేలిందన్నారు. మంగళవారం హైదరాబాద్లోని కత్రియా హోటల్లో ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత సీఎం మొదలు దళిత బంధు వరకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. అంబేద్కర్ ఆలోచనలకు, శ్యామ్ ప్రసాద్ ముఖర్టీ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తున్నదని చెప్పారు. దళితుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.