Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగతనం నెపంతో బాలుడిని చితకబాదిన వైనం
నవతెలంగాణ - వేములవాడ
వేములవాడ పట్టణంలో దారుణం జరిగింది. మల్లారం రోడ్డులోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఓ వివాహ వేడుకలో బాలుడు(15) దొంగతనానికి పాల్పడ్డాడనే అనుమానంతో అతన్ని తాళ్లతో స్తంభానికి కట్టేసి చితకబాదారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలున్ని స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా కేవలం అనుమానంతోనే బాలుడిని విచక్షణా రహితంగా చితకబాదడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం చేశాడో లేదో నిర్ధారణ కాకుండానే అలా వ్యవహరించడం ఏంటని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.