Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎండీఏకు కాంగ్రెస్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరగకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)కు కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్, ఎన్ డీఎంఏ సభ్య కార్యదర్శికి లేఖ రాసి మెయిల్ చేశారు. కరోనాలో అనేక మార్పులు జరిగి ఉద్భవించిన ఒమిక్రాన్ను అదుపు చేసేందుకు వీలుగా ఇతర రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వైన్ షాపులను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి, లిక్కర్ అమ్మేందుకు అర్థరాత్రి ఒంటి గంట వరకు అనుమతలనిచ్చిందని తెలిపారు.